Hyderabad: పోర్న్హబ్గా మారిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్.. ఫ్రీ డేటా మొత్తం ఆ వీడియోలకే
గతంలో ఓ సామెత ఉండేది.. మీరు ఎక్కాల్సిన రైలు జీవిత కాలం లేటు అని. ఇప్పుడా సామెత ఔట్ డేటెడ్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే.. ఎంత లేటైతే అంత గ్రేటు అనుకుంటున్నారు కొంతమంది ప్రయాణికులు. ఎందుకో తెలుసుకుందాం పదండి.
అసలు ఏమన్నా అంటే అన్నామంటారుగాని.. ఈ ఫ్రీవైఫై పెట్టిన ఉద్దేశమేంటి? జనాలు వాడే పర్పస్ ఏంటి? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి వెళ్తే వందల మంది ప్రయాణికులు నిత్యం రైళ్ల కోసం వెయిట్ చేస్తూనే కనిపిస్తారు. ఎక్కేవారు ఎక్కుతూ.. దిగేవారు దిగుతూ ఉంటారు. తమ రైలు లేటైతో ప్లాట్ఫామ్స్ మీదే పడిగాపులు పడుతుంటారు. ఈ వెయిటింగ్ పీరియడ్లో ఏం జరుగుతోంది? ఓ ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది. రైల్వే అధికారులే షాకయ్యే నిజాలు బయటికొచ్చాయి. ఫ్రీ వైఫై వాడుతున్న ట్రావెలర్స్.. ఎక్కువగా పోర్న్ వీడియోలు చూస్తూ.. కొందరు డౌన్లోడింగ్ చేస్తూ డేటాని ఖాళీ చేస్తున్నారు. నిర్ణీత సమయంలో ఇచ్చిన డేటా మొత్తం దీనికే వాడేస్తున్నారు ప్రయాణికులు. ఈ తతంగం ఒక్క సికింద్రాబాద్లోనే కాదు.. సౌత్ సెంట్రల్ రైల్వేస్(South Central Railway)లో ఉన్న విజయవాడ(Vijayawada), తిరుపతి(Tirupati) స్టేషన్లలోనూ నడుస్తోంది. సికింద్రాబాద్ స్టేషేన్లో రైల్టెల్ కంపెనీ.. రైల్వైర్ పేరుతో ఫ్రీ వైఫై ఇస్తోంది. ప్రయాణికులు ఎమర్జెన్సీలో వాడుకోడానికి ఈ డేటా ఉపయోగపడుతుంది. రోజుకి 30 నిమిషాలపాటు ఈ ఫ్రీ డేటా సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. మొత్తం 350 ఎంబీ డేటాని ప్రొవైడ్ చేస్తోంది రైల్టెల్. నిజానికి ఇచ్చిన ఈ డేటా హైస్పీడ్ అంటూ రైల్వేస్ ఊదరగొడుతున్నా.. వాస్తవానికి ఏమంత స్పీడ్ ఉండడం లేదు. దీనికి కారణం ఈ డౌన్లోడ్లే. విపరీతమైన డౌన్లోడింగ్ వల్ల.. అసలు వైఫైని ఎమర్జెన్సీలో ఉపయోగించుకునేవారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రైల్వైర్ వైఫైని ఉపయోగించేవారిలో 35శాతం పోర్న్సైట్లలో వీడియోలు చూడడం, డౌన్లోడ్లు చేయడం జరుగుతోందని సర్వీస్ ప్రొవైడర్లు చెబుతున్నారు. ఈ పోర్న్ కంటెంట్ తర్వాత యూట్యూబ్ స్ట్రీమింగ్, డౌన్లోడింగ్ జరగుతున్నట్లు తెలుస్తోంది.
దక్షిణమధ్య రైల్వేలో కొన్ని స్టేషన్లలోనే ఈ ఫ్రీ వైఫై అందుబాటులో ఉంది. దీన్ని 558 స్టేషన్లకు విస్తరించాలని భావిస్తోంది రైల్వేస్. కాని డేటా చూస్తే జనాలు పోర్న్ కోసమే అధికంగా వాడుతుండడంతో అధికారులు షాక్ అవుతున్నారు. విజయవాడ, టెంపుల్ సిటీ తిరుపతి రైల్వేస్టేషన్లోనూ ఇదే పరిస్థితి ఉంది. రైల్వైర్ ఇప్పటికే వందలాది పోర్న్ సైట్లను నిషేధించింది కాని.. VPN సహాయంతో ఆ సైట్లను వీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. రైల్టెల్ నిర్వాహకులు నిరంతరం ఈ సైట్లను బ్లాక్ చేస్తున్నా.. యూజర్లు మాత్రం కొత్త మార్గాల్లో డౌన్లోడ్స్ చేస్తున్నారని అధికారులంటున్నారు.
విశాఖ నుంచి రాత్రి ఎనిమిది గంటలకు బయలుదేరి తొమ్మిదో తేదీ మొత్తం సముద్రంలోనే ప్రయాణిస్తుంది. 10 వ తేదీ ఉదయం ఏడు గంటలకు పుదుచ్చేరి చేరుకుంటుంది. పుదుచ్చేరిలో రాత్రి ఏడు గంటల వరకు పర్యటించవచ్చు. ఆయా ఏర్పాట్లు కూడా సంస్థే చేస్తుంది. పుదుచ్చేరి లో రాత్రి ఏడు గంటలకు బయలుదేరి మరుసటి రోజు (నాలుగో రోజుకు) చెన్నై కు చేరుకుంటుంది. ఎంప్రెస్ విదేశీ విహార నౌక అయినప్పటికీ దీన్ని ప్రస్తుతం భారత దేశంలో మాత్రమే తిరిగేలా నిర్వాహకులు అనుమతులు పొందారు. దీంతో పాస్పోర్ట్ అవసరం లేదు. కస్టమ్స్ తనిఖీలు ఉండవు.
విశాఖ నౌకాశ్రయానికి గతంలో కూడా కొన్ని నౌకలు వచ్చినా ప్రస్తుతం ఈ నౌకకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయంటున్నారు. ఇంటీరియర్ స్టాండర్డ్ రూం, ఓషన్ వ్యూ స్టాండర్డ్ రూం, మినీ సూట్ రూం, సూట్ రూం పేరిట నాలుగు విభాగాలు నౌకలో ఉన్నాయి. ఒక్కో విభాగానికి ఒక్కో ధరను నిర్ణయించారు. అదే నౌక జూన్ 15 న, 22 వ తేదీన కూడా వస్తుంది. భారత సాగర తీరాల్లో మాత్రమే తిరిగే విహార నౌక కావడంతో అందులోని పర్యాటకులలో దాదాపు అందరూ భారతీయులే ఉంటారు. టికెట్ల విక్రయాలతో నౌకాశ్రయానికి సంబంధం లేదని విశాఖ నౌకాశ్రయం అధికారులు వెల్లడించారు
Comments
Post a Comment